రైతు వ్యతిరేక బిల్లులపై పోరాటం’

ABN , First Publish Date - 2020-10-01T08:27:03+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమైనవని, వాటిపై పోరాడాలని ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి క్రిస్టోఫర్‌ తిలక్‌ పిలుపునిచ్చారు. నగరానికి వచ్చిన ఆయన ఎల్లమ్మతోటలో ఉన్న కాంగ్రెస్‌ కార్యాలయంలో బుధవారం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.

రైతు వ్యతిరేక బిల్లులపై పోరాటం’

జగదాంబసెంటర్‌, సెప్టెంబరు 30: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమైనవని, వాటిపై పోరాడాలని ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి క్రిస్టోఫర్‌ తిలక్‌ పిలుపునిచ్చారు. నగరానికి వచ్చిన ఆయన ఎల్లమ్మతోటలో ఉన్న కాంగ్రెస్‌ కార్యాలయంలో బుధవారం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా పోరాడడంతోపాటు అధికార వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఎ.నారాయణ, నగర అధ్యక్షుడు శంకువెంకటేశ్వరరావు, యువజన కాంగ్రెస్‌ నాయకుడు శివకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T08:27:03+05:30 IST