కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించండి

ABN , First Publish Date - 2020-12-15T05:48:55+05:30 IST

: దేశంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండేది ఇంటక్‌ మాత్రమేనని రాష్ట్ర కాంగ్రెస్‌ కార్మిక విభాగం అధ్యక్షుడు ఎన్‌వీ శ్రీనివాసరావు అన్నారు. భెల్‌ హెచ్‌పీవీపీలో సోమవారం జరిగిన జిల్లా ఇంటక్‌ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించండి
జిల్లా ఇంటక్‌ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రీనివాసరావు

రాష్ట్ర కాంగ్రెస్‌ కార్మిక విభాగం అధ్యక్షుడు ఎన్‌వీ శ్రీనివాసరావు

అక్కిరెడ్డిపాలెం: దేశంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండేది ఇంటక్‌ మాత్రమేనని రాష్ట్ర కాంగ్రెస్‌ కార్మిక విభాగం అధ్యక్షుడు ఎన్‌వీ శ్రీనివాసరావు అన్నారు. భెల్‌ హెచ్‌పీవీపీలో సోమవారం జరిగిన జిల్లా ఇంటక్‌ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పట్ల కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి మాట్లాడుతూ కార్మిక సంక్షేమంతోపాటు దేశ ప్రజలకు సుస్థిర పాలన అందించగల సత్తా ఒక్క కాంగ్రెస్‌కు మాత్రమే వుందన్నారు. ఈ సమావేశానికి వార్డు కాంగ్రెస్‌ అధ్యక్షుడు గవర వెంకటరమణ అద్యక్షత వహించగా ఇంటక్‌ రాష్ట్ర నాయకుడు వేగి వెంకటేశ్‌, వివిద పరిశ్రమల ఇంటక్‌ నాయకులు ఉరుకూటి బాబురావు, వారాడ ఆనందరావు, టి.నరసింగరావు, ఎస్‌.నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T05:48:55+05:30 IST