కొత్తగా 18 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-27T05:32:31+05:30 IST
జిల్లాలో శనివారం మరో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో 59,538కు చేరిన బాధితుల సంఖ్య
విశాఖపట్నం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం మరో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 59,538కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి 58,738 మంది కోలుకోగా, మరో 282 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ జిల్లాలో ఇప్పటివరకు 518 మంది మృతి చెందారు.