మరో 28 కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2020-12-19T05:43:57+05:30 IST
జిల్లాలో శుక్రవారం మరో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో 59,290కు చేరిన మొత్తం బాధితుల సంఖ్య
విశాఖపట్నం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శుక్రవారం మరో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 59,290కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి 58,543 మంది కోలుకోగా, మరో 229 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో కరోనా బారినపడి 518 మంది మృతి చెందారు.