మరో 21 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-15T05:55:46+05:30 IST
జిల్లాలో సోమవారం మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో 29,167కు చేరిన బాధితుల సంఖ్య
విశాఖపట్నం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సోమవారం మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 29,167కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి 28,435 మంది కోలుకోగా, మరో 216 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు చికిత్స పొందుతూ 516 మంది మృత్యువాత చెందారు.