కొత్తగా 18 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-13T06:02:06+05:30 IST

జిల్లాలో శనివారం మరో 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 59,125కు చేరింది.

కొత్తగా 18  కరోనా కేసులు

జిల్లాలో 59,125కు చేరిన మొత్తం బాధితుల సంఖ్య

చికిత్స పొందుతూ ఒకరి మృతి

విశాఖపట్నం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శనివారం మరో 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 59,125కు చేరింది. వీరిలో వైరస్‌ నుంచి  58,348 మంది కోలుకోగా, మరో 261 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శనివారం ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాలు 516కు చేరాయి. 


Updated Date - 2020-12-13T06:02:06+05:30 IST