అచ్యుతాపురం సెజ్‌ వృద్ధి రేటు 24 శాతం

ABN , First Publish Date - 2020-12-10T05:35:23+05:30 IST

కరోనా కష్ట కాలాన్ని అధిగమించి అచ్యుతాపురం ఏపీ సెజ్‌ 24 శాతం వృద్ధి రేటు సాధించినట్టు వీఎస్‌ఈజడ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఆవుల రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు.

అచ్యుతాపురం సెజ్‌ వృద్ధి రేటు 24 శాతం
సమావేశంలో మాట్లాడుతున్న వీఎస్‌ఈజడ్‌ డీసీ ఆవుల రామ్మోహన్‌ రెడ్డి

కూర్మన్నపాలెం(విశాఖపట్నం), డిసెంబరు 9: కరోనా కష్ట కాలాన్ని అధిగమించి అచ్యుతాపురం ఏపీ సెజ్‌ 24 శాతం వృద్ధి రేటు సాధించినట్టు వీఎస్‌ఈజడ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఆవుల రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు. దువ్వాడ వీఎస్‌ఈజడ్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  గతేడాది మూడవ త్రైమాసానికి అచ్యుతాపురం సెజ్‌ ఎగుమతులు ద్వారా రూ.2,815 కోట్లు ఆర్జించగా, ఈ ఏడాది మూడవ త్రైమాసానికి  రూ.3,477 కోట్లుతో  24 శాతం వృద్ధి రేటు  సాధించిందని వివరించారు. ఎగుమతులలో మూడవ వంతు లారస్‌ ల్యాబ్స్‌కు చెందినవని తెలిపారు. 



Updated Date - 2020-12-10T05:35:23+05:30 IST