విశాఖకు అరుదైన గౌరవం
ABN , First Publish Date - 2020-11-19T15:54:13+05:30 IST
సుందరనగరం విశాఖకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్మార్ట్ సిటీ ఎక్స్పోలో అద్భుత ప్రదర్శనను ఇచ్చింది.
![విశాఖకు అరుదైన గౌరవం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020111910221882/11192020102317n32.jpg)
విశాఖపట్నం: సుందరనగరం విశాఖకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్మార్ట్ సిటీ ఎక్స్పోలో అద్భుత ప్రదర్శనను ఇచ్చింది. ఇంటర్ నేషనల్ స్మార్ట్ సిటీ ఎక్స్ పో అవార్డు పోటీ తుది జాబితాలో విశాఖకు చోటు లభించింది. భారత్ నుంచి ఈ అవార్డు కోసం పోటీ ఇచ్చిన ఏకైక నగరం విశాఖ. దివ్యాంగుల పిల్లల కోసం ప్రత్యేక పార్కును ఏర్పాటు చేయడంలో విశాఖకు గుర్తింపు లభించింది. దివ్యాంగులపార్క్ కేటగిరీలో 46 దేశాల సరసన విశాఖ నిలిచింది.