శారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-17T16:23:18+05:30 IST
విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి.
విశాఖపట్నం: విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర దసరా వేడుకలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో శారద స్వరూప రాజశ్యామల అమ్మవారు దర్శనమిస్తున్నారు. లోక కళ్యాణార్థం చండీ హోమం నిర్వహించారు. కోవిడ్ కారణాలతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా దసరా వేడుకలను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.