ఉపమాక వెంకన్న ఆలయం కిటకిట
ABN , First Publish Date - 2020-12-13T06:10:54+05:30 IST
కార్తీకమాసం చివరి శనివారం సందర్భంగా ఉపమాక వేంకటేశ్వరస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.

నక్కపల్లి, డిసెంబరు 12 : కార్తీకమాసం చివరి శనివారం సందర్భంగా ఉపమాక వేంకటేశ్వరస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామి నిజరూపానికి వేకుజామున అర్చకులు విశేష పూజలు నిర్వహిం చారు. ఇదిలావుంటే, దాతల సహకారంతో ఆలయ ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు భక్తులందరికీ అన్నదానం జరిపారు.