యూజీ, పీజీ పరీక్షలన్నీ రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-07-15T09:18:15+05:30 IST

కరోనా వైరస్‌ ఉధృతంగా పెరుగుతున్న నేపథం్యలో యూజీ, పీజీ పరీక్షలన్నీ..

యూజీ, పీజీ పరీక్షలన్నీ రద్దు చేయాలి

టీడీపీ నగర అధ్యక్షుడు వాసుల్లి డిమాండ్‌


మహారాణిపేట, జూలై 14: కరోనా వైరస్‌ ఉధృతంగా పెరుగుతున్న నేపథం్యలో యూజీ, పీజీ పరీక్షలన్నీ రద్దు చేయాలని టీడీపీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేశ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏడు కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలను సెప్టెంబరుకు వాయిదా వేయటాన్ని తప్పుబట్టారు. ఆ సమయంలో విద్యార్థులు కరోనా బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సనపల పాండురంగారావు, దొడ్డి రామానంద్‌, బాపు ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-15T09:18:15+05:30 IST