టీటీడీ డైరీల ఆవిష్కరణ
ABN , First Publish Date - 2020-11-07T06:06:12+05:30 IST
ఎంవీపీ కాలనీ టీటీడీ ఈ-దర్శన్ కౌంటర్ వద్ద శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్ధానం 2020 డైరీల ఆవిష్కరణ జరిగింది.
ఎంవీపీ కాలనీ, నవంబరు 6: ఎంవీపీ కాలనీ టీటీడీ ఈ-దర్శన్ కౌంటర్ వద్ద శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్ధానం 2020 డైరీల ఆవిష్కరణ జరిగింది. టీటీడీ ఈఈ వేణుగోపాల్, డీఈఈ దామోదర్, సూపరింటెండెంట్ ఎ.వెంకటరమణ, మేనేజర్ శేషుబాబు, పి.సత్యకుమార్, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కో డైరీ రూ. 130కి విక్రయిస్తున్నట్టు అధికారులు తెలిపారు.