త్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2020-11-27T06:05:37+05:30 IST
ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రంగా శనివారం జరగనున్న త్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ జీవీఎస్ పద్మావతి, డిపార్ట్మెంట్ అధికారి రాచకొండ శ్రీనివాసరావు తెలిపారు.
నక్కపల్లి, నవంబరు 26 : ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రంగా శనివారం జరగనున్న త్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ జీవీఎస్ పద్మావతి, డిపార్ట్మెంట్ అధికారి రాచకొండ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఈ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లా డారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి ప్రత్యేక చర్యలు తీసకుంటున్నట్టు చెప్పారు. 169 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాయనున్నట్టు చెప్పారు.