గిరిజన తెగల సంక్షేమ కమిటీ రాక రేపు
ABN , First Publish Date - 2020-03-02T10:20:59+05:30 IST
గిరిజన తెగల ( ఎస్టీ) సంక్షేమ కమిటీ సభ్యులు ఈనెల 3వ తేదీన విశాఖ నగరానికి రానున్నారు. విశాఖపట్నం సర్క్యూట్ హాస్లో వీరు బసచేస్తారు.

విశాఖపట్నం: గిరిజన తెగల ( ఎస్టీ) సంక్షేమ కమిటీ సభ్యులు ఈనెల 3వ తేదీన విశాఖ నగరానికి రానున్నారు. విశాఖపట్నం సర్క్యూట్ హాస్లో వీరు బసచేస్తారు. అదేరోజు ఉదయం 8 గంటలకు రోడ్డుమీదుగా బయలుదేరి 8.30 గంటలకు సింహచలం చేరుకుంటారు. అక్కడ దేవస్థానం ఈవోతో సమావేశం కానున్నారు. సింహాచలం దేవస్థానంలో ఎస్టీ రిజర్వేషన్పై చర్చించనున్నారు. అక్కడ నుంచి 9.30 గంటలకు బయలుదేరి ఆంధ్రా యూనివర్సిటీ చేరుకుంటారు. ఏయూ వైస్చాన్సలర్తో ఎస్టీ రిజర్వేషన్పై చర్చించనున్నారు. ఆదేరోజు సాయంత్రం విశాఖపట్నం పోర్టుగెస్ట్ హాస్లో బసచేస్తారు. 4న నగరంలోని ఎస్టీ హాస్టళ్లను సందర్శిస్తారు. అదే రోజు రోడ్డు మార్గంలో అరకు చేరుకుంటారు. 5న ఉదయం అరకు నుంచి పాడేరు చేరుకుంటారు. ఉదయం 10.30 గంటలకు ఐటీడీఏ కార్యాలయంలో రిజర్వేషన్ అమలుపై చర్చించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు పాడేరు నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. విశాఖ నుంచి ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో బయలుదేరి 6న విజయవాడ చేరుకుంటారు.