ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న వాహనం
ABN , First Publish Date - 2020-11-13T06:19:57+05:30 IST
గంజాయి లోడుతో అతి వేగంగా వెళుతున్న ఓ స్కార్పియో వాహనం గురువారం మధ్యాహ్నం అదుపు తప్పి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొంది.
బయటపడిన గంజాయి మూటలు
పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
నర్సీపట్నం టౌన్, నవంబరు 12 : గంజాయి లోడుతో అతి వేగంగా వెళుతున్న ఓ స్కార్పియో వాహనం గురువారం మధ్యాహ్నం అదుపు తప్పి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొంది. ఐదురోడ్లు మీదుగా ధనిమిరెడ్డివారి వీధిలోంచి తుని రోడ్డులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విద్యుత్ స్తంభం ఒరిగిపోయి అక్కడ పార్కింగ్ చేసి ఉన్న మరో కారుపై పడింది. తీగలు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెద్దపెట్టున శబ్ధం రావడంలో స్థానికులు భయాందోళన చెందారు. కారులో గంజాయి మూటలు బయటపడడంతో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, మరో వ్యక్తి కారులోంచి దిగి పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు.