ఇళ్ల నిర్మాణంపై సచివాలయ సిబ్బందికి శిక్షణ

ABN , First Publish Date - 2020-12-16T05:21:28+05:30 IST

వైఎస్సార్‌ గృహ నిర్మాణ పథకంలో భాగంగా చేపట్టనున్న ఇళ్ల నిర్మాణంపై సచివాలయ సిబ్బందికి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఇళ్ల నిర్మాణంపై సచివాలయ సిబ్బందికి శిక్షణ
సమావేశంలో మాట్లాడుతున్న హౌసింగ్‌ డీఈఈ ఏవీవీఎస్‌ఎన్‌ రాజు

పరవాడ, డిసెంబరు 15: వైఎస్సార్‌ గృహ నిర్మాణ పథకంలో భాగంగా చేపట్టనున్న ఇళ్ల నిర్మాణంపై సచివాలయ సిబ్బందికి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్‌ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఏవీవీఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌, వెల్ఫేర్‌, డిజిటల్‌ అసిస్టెంట్లు ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు. ఎవరెవరు ఏయే పనులు చేయాలో వివరించారు. గృహ నిర్మాణ పథకం విజయవంతం కావడానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల హౌసింగ్‌ ఏఈఈ ఎంఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, మండల పరిషత్‌ సూపరింటెండెంట్‌ ఎల్‌.కామేశ్వరరావు, రమేశ్‌నాయుడు, రమణ బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T05:21:28+05:30 IST