బొజ్జన్నకొండ రహదారికి మరమ్మతులు చేపట్టాలి
ABN , First Publish Date - 2020-12-21T04:31:35+05:30 IST
ప్రముఖ బౌద్ధక్షేత్రం బొజ్జన్నకొండకు చేరుకునే ప్రధాన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సిద్ధార్థ సోషల్ సర్వీసెస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బల్లా నాగభూషణం డిమాండ్ చేశారు.

తుమ్మపాల, డిసెంబరు 20: ప్రముఖ బౌద్ధక్షేత్రం బొజ్జన్నకొండకు చేరుకునే ప్రధాన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సిద్ధార్థ సోషల్ సర్వీసెస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బల్లా నాగభూషణం డిమాండ్ చేశారు. అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆదివారం ప్లకార్డులతో నిరసన చేపట్టారు. బొజ్జన్నకొండపై ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారని, తక్షణమే మరమ్మతులు చేపట్టి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి శీలా మానీయులు, ఉపాధ్యక్షుడు ఉజ్జి సత్యనారాయణ, సహాయకార్యదర్శి బల్లా శ్రీనివాసరావు, కార్యవర్గసభ్యుడు అల్లాడ శ్రీనివాసరావు, వినకోట నీలేష్గుప్తా పాల్గొన్నారు.