రైతుల ఉద్యమానికి విద్యార్థి సంఘాల మద్దతు
ABN , First Publish Date - 2020-12-16T05:26:54+05:30 IST
ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ సీతమ్మధార రిలయన్స్ ఫ్రెష్ ఎదురుగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, పీడీఎస్వో విద్యార్థి సంఘాల నేతలు నిరసన చేపట్టారు.
సీతమ్మధార, డిసెంబరు 15: ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ సీతమ్మధార రిలయన్స్ ఫ్రెష్ ఎదురుగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, పీడీఎస్వో విద్యార్థి సంఘాల నేతలు నిరసన చేపట్టారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. జియో ఫోన్లు, సిమ్లు, రిలియన్స్ ఫ్రెష్లను దేశ ప్రజలంతా బహిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు జి.ఫణీంద్రకుమార్, ఎల్.జగ్గునాయుడు, పడాల గోవింద్, జి.వామనమూర్తి, ఎన్.మధురెడ్డి, ఎ.సురేష్కుమార్ పాల్గొన్నారు.