ఏటికొప్పాక షుగర్స్‌లో క్రషింగ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-30T06:10:44+05:30 IST

ఏటికొప్పాక చక్కెర కర్మాగారంలో రెగ్యులర్‌ క్రషింగ్‌ మంగళవారం ఉదయం 11.35 గంటలకు ప్రారంభమైంది.

ఏటికొప్పాక షుగర్స్‌లో క్రషింగ్‌ ప్రారంభం
కేన్‌ క్యారియర్‌లో చెరకు గడలు వేస్తున్నఎమ్మెల్యే బాబూరావు, ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావు


ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావు హాజరు


ఎస్‌.రాయవరం, డిసెంబరు 29: ఏటికొప్పాక చక్కెర కర్మాగారంలో రెగ్యులర్‌ క్రషింగ్‌ మంగళవారం ఉదయం 11.35 గంటలకు ప్రారంభమైంది. అంతకు ముందు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావు పూజలు నిర్వహించి, కేన్‌ క్యారియర్‌లో చెరకు గడలు వేసి క్రషింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు బకాయి జీతాలను వెంటనే చెల్లించేలా చూడాలని ఎమ్మెల్యేని కోరారు. ఈ విషయమైన జాయింట్‌ కలెక్టర్‌తో మాట్లాడతానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ మాజీ డైరెక్టర్లు రాజాబాబు, శంకరరావు, వైసీపీ నాయకులు సీతబాబు, పి.పెదఈశ్వరరావు, అద్దేపల్లి నూకినాయుడు, బాబీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-30T06:10:44+05:30 IST