కొనసాగుతున్న సచివాలయ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ABN , First Publish Date - 2020-11-07T05:45:14+05:30 IST

గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతున్నది. శుక్రవారం తాటిచెట్లపాలెంలో ఉద్యానవన శాఖ కార్యాలయంలో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు.

కొనసాగుతున్న సచివాలయ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
ఉద్యానవనశాఖ కార్యాలయంలో ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు

నేడు కేటగిరీ-1 అభ్యర్థులకు..

విశాఖపట్నం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతున్నది. శుక్రవారం తాటిచెట్లపాలెంలో ఉద్యానవన శాఖ కార్యాలయంలో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొత్తం 247 ఖాళీలకు 72 మంది ఎంపికకాగా వారిలో 38 మంది అభ్యర్థులు హాజరయ్యారని ఉద్యానవనశాఖ డీడీ గోపికుమార్‌ తెలిపారు. కాగా పశుసంవర్ధక శాఖలో ఇప్పటికే సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌ పూర్తయ్యింది. జీవీఎంసీ పరిధిలో పలు పోస్టులకు ఆయా విభాగాల అధికారుల నేతృత్వంలో ధ్రువపత్రాల పరిశీలన చేస్తున్నారు. అయితే కీలకమైన కేటగిరీ-1 కింద పేర్కొన్న పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలు శనివారం స్వర్ణభారతి స్టేడియంలో నిర్వహించనున్నారు. కేటగిరీ-2లో వీఆర్వో, సర్వేయర్‌ పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనపై అధికారులు రెండు, మూడు రోజుల్లో నిర్ణయిస్తారు. 


Updated Date - 2020-11-07T05:45:14+05:30 IST