రామాలయ నిర్మాణం అందని బాధ్యత

ABN , First Publish Date - 2020-12-27T06:29:21+05:30 IST

అయోధ్యలో రామాలయం నిర్మించే బాధ్యత ప్రతీ హిందువుపై ఉందని పాకలపాడు గురు ఆశ్రమ స్వామీజీ రామానంద స్వామి అన్నారు.

రామాలయ నిర్మాణం అందని బాధ్యత
సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రామానంద స్వామి.



పాకలపాడు ఆశ్రమ స్వామీజీ రామానంద స్వామి

కొయ్యూరు, డిసెంబరు 26: అయోధ్యలో రామాలయం నిర్మించే బాధ్యత ప్రతీ హిందువుపై ఉందని పాకలపాడు గురు ఆశ్రమ స్వామీజీ రామానంద స్వామి అన్నారు. శనివారం చింతలపూడిలో విశ్వహిందూపరిషత్‌, సమరసత సేవ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర ధర్మనిధి సమర్పణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామానందస్వామి రామమందిర నిర్మాణంలో హిందువుల భాగస్వామ్యంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్‌, గెమ్మెల మోహనరావు, పనసల రామకృష్ణ, ఈరే మల్లిబాబు, సెగ్గే సన్యాసిరావు, వరలక్ష్మి, డీవీడీ ప్రసాద్‌, సెగ్గే అప్పారావు, కూడా ఎర్రయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T06:29:21+05:30 IST