ఆరిలోవ అటవీ ప్రాంత రహదారి దుస్థితిపై స్పందన
ABN , First Publish Date - 2020-12-12T04:50:17+05:30 IST
ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఐదు కిలో మీటర్ల మేర కోతకు గురైన రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఆర్అండ్బీ డీఈ ఎస్.వేణుగోపాల్, అటవీ రేంజ్ ఆఫీసర్ అప్పలరాజు శుక్రవారం పరిశీలిం చారు.
![ఆరిలోవ అటవీ ప్రాంత రహదారి దుస్థితిపై స్పందన](https://media.andhrajyothy.com/appimg/galleries/2020121111181016/12112020231831n68.jpg)
తాత్కాలిక మరమ్మతుకు ఆర్అండ్బీ, అటవీ అధికారులు పరిశీలన
గొలుగొండ, డిసెంబరు 11 : ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఐదు కిలో మీటర్ల మేర కోతకు గురైన రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఆర్అండ్బీ డీఈ ఎస్.వేణుగోపాల్, అటవీ రేంజ్ ఆఫీసర్ అప్పలరాజు శుక్రవారం పరిశీలిం చారు. ఈ రహదారి దుస్థితిపై ఇటీవల బీజేపీ మండల నాయకులు వంటా- వార్పు ద్వారా సదరు రోడ్డు ప్రాంతంలో ఆందోళన చేసిన నేపథ్యంలో అధికారుల్లో కదలిక ఏర్పడింది. ఆర్అండ్బీ జేఈ ప్రసాద్, సెక్షన్ ఆఫీసర్ సతీశ్, బీజేపీ నాయకులు ఎర్రినాయుడు, పృద్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.