విశాఖ జిల్లాలో 259 చేనేత కార్మికులకు చేయూత

ABN , First Publish Date - 2020-12-20T06:01:22+05:30 IST

జిల్లాలో 259 మంది చేనేత కార్మికులకు నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చెల్లిస్తున్నామని చేనేత, జౌళి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు బి.ధనుంజయరావు చెప్పారు.

విశాఖ జిల్లాలో 259 చేనేత కార్మికులకు చేయూత
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీడీ ధనుంజయరావు

చేనేత, జౌళి శాఖ ఆర్డీడీ ధనుంజయరావు


కశింకోట, డిసెంబరు 19: విశాఖ జిల్లాలో 259 మంది చేనేత కార్మికులకు నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చెల్లిస్తున్నామని చేనేత, జౌళి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు బి.ధనుంజయరావు చెప్పారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులకు ముద్రా రుణాలు అందించేందుకు బ్యాంకులతో చర్చించామన్నారు. యార్న్‌ రిబేటు పథకంలో భాగంగా ఉత్పత్తి చేసిన నూలు వస్ర్తాల ఆధారంగా 40 శాతం రిబేటుగా, పది శాతం చేనేత సంఘానికి, 30 శాతం నేతన్న బ్యాంకు ఖాతాకు జమ చేస్తున్నట్టు చెప్పారు. ఆయన వెంట ఎంపీడీవో కె.హరిప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-20T06:01:22+05:30 IST