వైద్యపరీక్షలకు ధరలు నిర్ణయించాలి
ABN , First Publish Date - 2020-07-12T09:32:01+05:30 IST
కరోనా నేపథ్యంలో వైద్య పరీక్షలకు ప్రభుత్వం నిర్ణీత రుసుములు నిర్ణయించాలని ఆరోగ్యశాఖ మంత్రికి సీపీఐ నగర కార్యదర్శి మరుపల్లి
సీపీఐ నగర కార్యదర్శి పైడిరాజు
విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో వైద్య పరీక్షలకు ప్రభుత్వం నిర్ణీత రుసుములు నిర్ణయించాలని ఆరోగ్యశాఖ మంత్రికి సీపీఐ నగర కార్యదర్శి మరుపల్లి పైడిరాజు లేఖ రాశారు. ప్రస్తుతం ఏ చిన్న అనారోగ్యంతో క్లినిక్లకు వెళ్లినా అక్కడి వైద్యులు చాంతాడంత జాబితా రాసి వైద్యపరీక్షలు చేయించుకొని రమ్మంటున్నారని, వాటికే రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతోందని ఆరోపించారు. లేబొరేటరీల్లో అవసరమైనంత సిబ్బంది లేకపోయినా అన్ని రకాల పరీక్షలు చేసేస్తున్నారని, వాటి రిపోర్టులపై విశ్వాసం పోతోందన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.