సింహాచలంలో ‘పొగరున్నోడు’
ABN , First Publish Date - 2020-09-16T09:01:44+05:30 IST
యువ హీరో అఖిల్రెడ్డి, హీరోయిన్ రాశీసింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘పొగరున్నోడు’ సినిమా షూటింగ్ సింహాచలంలో జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను మంగళవారం ఇక్కడ చిత్రీకరించారు. ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ను లాక్

సింహాచలం, సెప్టెంబరు 15: యువ హీరో అఖిల్రెడ్డి, హీరోయిన్ రాశీసింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘పొగరున్నోడు’ సినిమా షూటింగ్ సింహాచలంలో జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను మంగళవారం ఇక్కడ చిత్రీకరించారు.
ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ను లాక్డౌన్కు ముందు విశాఖ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా జరిపామని... ఇప్పుడు నిబంధనలను సడలించడంతో మళ్లీ షూటింగ్ ప్రారంభించామని దర్శకుడు పద్మరాజ్ తెలిపారు. ప్రేమ సన్నివేశాలతో పాటు రెండు పాటలను భీమిలి, ఆర్కే బీచ్ వంటి సుందరమైన ప్రాంతాల్లో చిత్రీకరించామన్నారు.