వ్యవసాయ యాంత్రీకరణకు పెరుగుతున్న ఆదరణ
ABN , First Publish Date - 2020-08-10T10:21:15+05:30 IST
వ్యవసాయ యాంత్రీకరణకు ఆదరణ పెరుగుతుందని ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అన్నారు.
రాంబిల్లి, ఆగస్టు 9 : వ్యవసాయ యాంత్రీకరణకు ఆదరణ పెరుగుతుందని ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్సీకి చెందిన 14 ఎకరాల పొలంలో 4 రోస్ వరినాటే యంత్రంతో బీసీటీ కేవీకే శాస్త్రవేత్తల నేతృత్వంలో వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్తలు బి.శ్రీహరిరావు, శ్రీకాంతగౌడ, బి.నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూలీల ద్వారా నాట్లు వేస్తే సుమారు రూ.6000 ఖర్చు అవుతుందని, యంత్రంతో నాట్లు వేస్తే ఎకరాలకు రూ.3500 మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పారు. మదుపులు తక్కువగా ఉంటూ నాణ్యమైన దిగుబడులు వస్తాయన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ లాభదాయకంగా ఉన్న వ్యవసాయ యాంత్రీకరణను రైతులు సద్వినియోగంలో చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీటీ సామాజిక కార్యకర్త ఎస్.నాగేశ్వరావు, రైతులు పాల్గొన్నారు.