కొనసాగుతున్న సెయిల్ కార్మికుల నిరసన
ABN , First Publish Date - 2020-12-04T04:27:22+05:30 IST
తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ స్టీల్ అఽథారిటీ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కార్మికులు చేపట్టిన నిరసన కొనసాగుతోంది.

ఆటోనగర్, డిసెంబరు 3: తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ స్టీల్ అఽథారిటీ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కార్మికులు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. అర్ధంతరంగా తొలగించిన 40 మంది కార్మికులను విధుల్లోకి తీసుకుని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పది రోజులు గా పరిశ్రమ గేటు ఎదుట ఆందోళన చేస్తున్నా బాధితులను పట్టించుకోని యాజమాన్యం చర్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.