ఒడిశా అటవీ శాఖ అధికారుల దురాక్రమణ
ABN , First Publish Date - 2020-12-15T05:46:16+05:30 IST
మండల పరిధిలో ఒడిశా దురాక్రమణ లు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటి వరకు కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలో ఆంధ్రా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఒడిశా అధికారులు ఆ సమస్య పరిష్కారం కాకుండానే తాజాగా తూటంగి పంచాయతీ గ్రామాల్లోని ఆంధ్రా భూభాగాన్ని ఒడిశా అటవీ శాఖాధికారులు ఆక్రమించుకున్నారని గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి టి.సూర్యనారాయణ ఆరోపించారు.
డుంబ్రిగుడ: మండల పరిధిలో ఒడిశా దురాక్రమణ లు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటి వరకు కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలో ఆంధ్రా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఒడిశా అధికారులు ఆ సమస్య పరిష్కారం కాకుండానే తాజాగా తూటంగి పంచాయతీ గ్రామాల్లోని ఆంధ్రా భూభాగాన్ని ఒడిశా అటవీ శాఖాధికారులు ఆక్రమించుకున్నారని గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి టి.సూర్యనారాయణ ఆరోపించారు. తూటంగి పంచాయతీలోని బల్లకట్టు, తోకలాసేరు, దూభారై, లాసేరు, బల్దగడ్డ, దాతూరు గ్రామాల్లోకి ప్రవేశించి రాళ్లగుట్టలు పెట్టారన్నారు. సరిహద్దులో అటవీహక్కు పత్రాలు పొంది భూములను సాగు చేసుకుంటుండగా ఒడిశా అటవీ అధికారులు దురాక్రమణ చేస్తున్నారన్నారు. ఈ విషయమై స్థానిక అధికారులు వెంటనే స్పందించాలన్నారు.