కేజీహెచ్కి ఎన్టీపీసీ రూ.కోటి విరాళం
ABN , First Publish Date - 2020-11-08T05:11:58+05:30 IST
విశాఖ కేజీహెచ్లో అంకాలజీ వార్డు నిర్మాణానికి ఎన్టీపీసీ కార్పొరేట్ సెంటర్ రూ.కోటి విరాళం అందజేసింది.
![కేజీహెచ్కి ఎన్టీపీసీ రూ.కోటి విరాళం](https://media.andhrajyothy.com/appimg/galleries/202011071140336/11072020234145n4.jpg)
పరవాడ, నవంబరు 7: విశాఖ కేజీహెచ్లో అంకాలజీ వార్డు నిర్మాణానికి ఎన్టీపీసీ కార్పొరేట్ సెంటర్ రూ.కోటి విరాళం అందజేసింది. దీనికి సంబంధించిన చెక్కును సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్ఆర్ అధికారులువి.అనంతజగన్నాథ్, ప్రకాశ్ శనివారం కేజీహెచ్ సూపరింటెండెంట్ మైథిలీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కేజీహెచ్ తరఫున ఎన్టీపీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.