నివర్ పరిహారం రూ.11.35 కోట్లు
ABN , First Publish Date - 2020-12-30T05:57:47+05:30 IST
‘నివర్’ తుఫాన్ కారణంగా 7,568 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, 37,494 మంది రైతులకు రూ.11.35 కోట్లు పెట్టుబడి సహాయంగా అందజేస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

రైతు భరోసా కింద రూ.15.55 కోట్లు
మహారాణిపేట, డిసెంబరు 29: ‘నివర్’ తుఫాన్ కారణంగా 7,568 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, 37,494 మంది రైతులకు రూ.11.35 కోట్లు పెట్టుబడి సహాయంగా అందజేస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి పాల్గొన్న ఆయన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత కింద 44,532 రైతు కుటుంబాలకు రూ.15.55 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఈ మేరకు పరిహారానికి సంబంధించిన రూ.26.9 కోట్ల చెక్కును రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వి.వినయ్చంద్, జేసీ వేణుగోపాలరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.