కొయ్యూరు, మంప స్టేషన్లను ఏఎస్పీ ఆకస్మిక తనిఖీ
ABN , First Publish Date - 2020-12-13T06:21:59+05:30 IST
కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్లను నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్సిన్హా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు తనిఖీ చేశారు.

కొయ్యూరు, డిసెంబరు 12: కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్లను నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్సిన్హా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ భద్రతను పరిశీలించి, సిబ్బందికి సూచనలిచ్చారు. అలాగే సిబ్బంది నివాస గృహాలు పరిశీలించి, అదనంగా చేపట్టాల్సిన వసతులపై ఆరా తీశారు. ఆయన వెంట సీఐ ఎస్.వెంకటరమణ, ఎస్ఐలు డి.నాగేంద్ర, కె.సన్నిబాబు ఉన్నారు.