పంతాలకు పోవద్దు.. మనస్సు మార్చుకోండి
ABN , First Publish Date - 2020-12-18T05:29:10+05:30 IST
రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్ అనవసర పంతాలకు పోకుండా మనస్సు మార్చుకోవాలని పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు హితవు పలికారు.

ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ బుద్ద హితవు
చోడవరం, డిసెంబరు 17: రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్ అనవసర పంతాలకు పోకుండా మనస్సు మార్చుకోవాలని పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు హితవు పలికారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధానిగా ఆంధ్రులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారన్నారు. ఉపాధి బిల్లుల మంజూరులో కక్షసాధింపు తగదని, ప్రభుత్వం నుంచి వడ్డీతో సహా రాబడతామని స్పష్టం చేశారు. ఆయన వెంట నాయకులు బత్తుల తాతయ్యబాబు, మల్లునాయుడు, పెదబాబు, పూతి కోటేశ్వరరావు, బి.లక్ష్మణరావు, ఎస్.శ్రీను, వి.అప్పారావు, డి.కిశోర్, త్రినాథరావు, ఎస్.సత్యారావు పాల్గొన్నారు.