-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » MLA Ganta ask cader to win in gvmc
-
గ్రేటర్ పీఠం దక్కించుకోవాలి
ABN , First Publish Date - 2020-12-20T05:08:25+05:30 IST
జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతికార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

అదే లక్ష్యంగా పనిచేయండి
పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే గంటా పిలుపు
కంచరపాలెం, డిసెంబరు 19: జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతికార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని నర్సింహనగర్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో పూర్తి బాధ్యత పార్టీ వార్డు అధ్యక్షులదేనని తెలిపారు. విజయంపై పూర్తి బాధ్యత తీసుకున్న వారినే అధ్యక్షులుగా నియమిస్తున్నామని, వారు స్థానిక సమస్యలపై దృష్టిసారించి ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డు అధ్యక్షులను గంటా అభినందించారు.