పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం

ABN , First Publish Date - 2020-12-30T05:35:10+05:30 IST

పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలనేదే సీఎం జగన్‌ లక్ష్యమని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు.

పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం
రోలుగుంట: జేపీ అగ్రహారంలో పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ


రోలుగుంట/రావికమతం, డిసెంబరు 29: పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలనేదే సీఎం జగన్‌ లక్ష్యమని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. రోలుగుంట, రావికమతం మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ, పేదోళ్ల కష్టాలను తీర్చడానికి, అర్హులందరికీ పక్కా గృహాల మంజూరుకు జగన్‌ పూనుకున్నారన్నారు. ఇళ్ల పట్టాల మంజూరు నిరంతర పక్రియని, మిగిలిన అర్హులకు కూడా పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్‌లు కృష్ణమూర్తి, కనకారావు, డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి ముక్కా మహాలక్ష్మినాయుడు, వైసీపీ నాయకులు మడ్డు అప్పలనాయుడు, కంచిపాటి జగన్నాఽథరావు, తమరాన వెంకటరమణ, వెంకట్‌, గుమ్మడి సత్యదేవా, పతివాడ చిన్నంనాయుడు, సేలం శంకరరావు, బలిరెడ్డి రాజు, నక్క చంటి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:35:10+05:30 IST