భీమిలిలో మెగా జాబ్ మేళా నేడు
ABN , First Publish Date - 2020-12-20T05:20:16+05:30 IST
భీమిలి నర్సింహస్వామి గుడివీధిలో సాయి అశ్విని ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

భీమునిపట్నం, డిసెంబరు 19: భీమిలి నర్సింహస్వామి గుడివీధిలో సాయి అశ్విని ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం వరకు జాబ్ మేళాను నిర్వహిస్తామన్నారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ మేళాకు హాజరవుతారని, టెన్త్ నుంచి ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిన అభ్యర్థులు హాజరు కావాలని కోరారు.