సరిహద్దు సమస్యకు త్వరలో పరిష్కారం
ABN , First Publish Date - 2020-12-05T06:05:25+05:30 IST
ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలో ఆంధ్రా, ఒడిశా రాష్ర్టాల సరిహద్దు సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఐటీడీఏ పీవో డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు.

ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్
సమగ్ర సర్వే చేయాలని అధికారులకు ఆదేశం
పాడేరు, డిసెంబర్ 4: ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలో ఆంధ్రా, ఒడిశా రాష్ర్టాల సరిహద్దు సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఐటీడీఏ పీవో డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖల అధికారులతో చర్చించారు. నిపుణులైన సర్వేయర్లను నియమించి రాష్ట్ర సరిహద్దులు గుర్తించాలని ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతికి సూచించారు. ఇరు రాష్ట్రాల అధికారులతో సమగ్ర సర్వే చేయాలని స్పష్టం చేశారు. అటవీ శాఖ, పోలీస్ అధికారులు ఇప్పటికే నిర్వహించిన సర్వే గురించి పీవోకు వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీవో డీఎఫ్వో వినోద్కుమార్, డీఎస్పీ వి.బి.రాజ్కమల్ తదితరులు పాల్గొన్నారు.