కలాం స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలి
ABN , First Publish Date - 2020-12-13T06:10:33+05:30 IST
అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు.

ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్
హుకుంపేట: అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు అబ్దుల్ కలాం రాసిన పుస్తకాలు చదివితే ఎన్నో విజయాలు సాధించగలరన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సోమేశ్వరరావు, సీఐ మీసాల కృష్ణమూర్తి, టి.సురేష్, మధుసూదన్, సాగరి రాజశేఖర్, జలుగు వాసుదేవరావు పాల్గొన్నారు.