విశాఖలో మరిన్ని ఐటీ కంపెనీలు రావాలి: గౌతమ్రెడ్డి
ABN , First Publish Date - 2020-02-20T08:35:04+05:30 IST
విశాఖలో మరిన్ని ఐటీ కంపెనీలు రావాలి: గౌతమ్రెడ్డి
సాగర్నగర్, ఫిబ్రవరి 19: విశాఖలో మరిన్ని ఐటీ కంపెనీలు రావాలని రాష్ట్రపరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అన్నారు. మిలీనియం టవర్స్లో పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఆయన బుధవారం ఐటీ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీలతో పాటు మరిన్ని ఐటీ కంపెనీలు పెట్టాలన్నారు. మరిన్ని కంపెనీలు వస్తే 50 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అందుకు ఆయా శాఖలు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐటీకి సంబంధించిన అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యుత్, రహదారులు, వాటర్, రవాణా తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కళాశాల యాజమాన్యం తో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఐటీకి అవసరమైన కోర్సులు చెప్పాలని ఐటీ యాజమాన్యాన్ని కోరారు.అంతకు ముందు మిలీనియం టవర్స్ను సందర్శించారు. అక్కడ ఉన్న ఉద్యోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలక్ర్టిక్ మోటారు సైకిళ్లను పరిశీలించారు.