ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-07-12T09:33:43+05:30 IST
రాష్ట్రంలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.మధు డిమాండ్ చేశారు. పాలనాపరంగా, కారుణ్య కారణాల
డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్
అచ్యుతాపురం, జూలై 11: రాష్ట్రంలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.మధు డిమాండ్ చేశారు. పాలనాపరంగా, కారుణ్య కారణాల రీత్యా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తే అభ్యంతరం లేదన్నారు. కాని రాజకీయ ఒత్తిళ్లతో అక్రమ బదిలీలు జరిగితే ఇతరులు నష్టపోతారన్నారు. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు.