గాజువాకలో అదనపు కోర్టులు ఏర్పాటుకు కృషి
ABN , First Publish Date - 2020-12-13T05:58:08+05:30 IST
గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో కక్షిదారుల అవసరాలు తీర్చేందుకు వీలుగా అవసరమైన అదనపు కోర్టుల ఏర్పాటుకు కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మ అన్నారు.

గాజువాక: గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో కక్షిదారుల అవసరాలు తీర్చేందుకు వీలుగా అవసరమైన అదనపు కోర్టుల ఏర్పాటుకు కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మ అన్నారు. గాజువాక కోర్టు కాంప్లెక్స్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న కోర్టు భవనంపై కొత్త నిర్మాణం సత్వరమే పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఆయనను న్యాయవాదులు సత్కరించారు. కార్యక్రమంలో గాజువాక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస సత్యనారాయణ, విశాఖ బార్ అసోసియేషన్ ప్రతినిధులు జి.మహేశ్వరరెడ్డి, కన్నబాబు, విశ్వనాఽథ్, ప్రభాకరరావు పాల్గొన్నారు.