నేటి నుంచి విధుల్లోకి జీవీఎంసీ కమిషనర్‌ సృజన

ABN , First Publish Date - 2020-03-27T09:59:50+05:30 IST

జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన శుక్రవారం నుంచి తిరిగి విధుల్లో చేరనున్నారు. ఈ నెల నాలుగు

నేటి నుంచి విధుల్లోకి జీవీఎంసీ కమిషనర్‌ సృజన

విశాఖపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన శుక్రవారం నుంచి తిరిగి విధుల్లో చేరనున్నారు. ఈ నెల నాలుగు నుంచి ఆమె మెటర్నరీ లీవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె వచ్చే నెల నాలుగు వరకు సెలవు పెట్టారు. అయితే కరోనా వైరస్‌ అలజడి నేపథ్యంలో శుక్రవారం నుంచి విధులకు హాజరు కానున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలపడంతో అనుమతి లభించింది.

Updated Date - 2020-03-27T09:59:50+05:30 IST