భైరవస్వామికి గుమ్మడి దీపాలు

ABN , First Publish Date - 2020-11-16T05:16:35+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామి ఉపాలయంగా అటవీ ప్రాంతంలో కొలువుదీరిన భైరవస్వామికి పెద్దసంఖ్యలో భక్తులు గుమ్మడి దీపాలతో నీరాజనాలు సమర్పించారు.

భైరవస్వామికి గుమ్మడి దీపాలు
గుమ్మడి దీపాలు వెలిగిస్తున్న భక్తులు

సింహాచలం, నవంబరు 15: వరాహలక్ష్మీనృసింహస్వామి ఉపాలయంగా అటవీ ప్రాంతంలో కొలువుదీరిన భైరవస్వామికి పెద్దసంఖ్యలో భక్తులు గుమ్మడి దీపాలతో నీరాజనాలు సమర్పించారు. అమావాస్య సందర్భంగా ఆదివారం వేకువజాము నుంచే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమృత కలశాలను సమర్పించి, గుమ్మడికాయలలో దీపాలు వెలిగించారు. 


Updated Date - 2020-11-16T05:16:35+05:30 IST