రేపటి నుంచి దశలవారీగా తరగతులు

ABN , First Publish Date - 2020-11-22T05:10:11+05:30 IST

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి దశల వారీగా తరగతులను పునఃప్రారంభిస్తామని వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపటి నుంచి దశలవారీగా తరగతులు

‘గీతం’ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ

సాగర్‌నగర్‌, నవంబరు 21: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి దశల వారీగా తరగతులను పునఃప్రారంభిస్తామని వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో  తెలిపారు. కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే విద్యార్థులను దశలవారీగా తరగతులకు అనుమతిస్తామన్నారు. సోమవారం నుంచి నుంచి బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు యథావిధిగా హాజరవుతారని, 30వ తేదీ నుంచి ఎమ్మెస్సీ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎం.ఫార్మశీ, ఎమ్‌.ఆర్క్‌ తదితర పీజీ కోర్సుల విద్యార్థులు తరగతులు, ప్రయోగశాలలు, ప్రాజెక్టు వర్క్‌లకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మిగిలిన విద్యార్థులు జనవరి 18 నుంచి రెండో సెమిస్టర్‌ తరగతులకు హాజరవుతారన్నారు. హాస్టళ్లు, తరగతి గదులు, ప్రయోగశాలలను శానిటైజేషన్‌ చేయడంతో పాటు విద్యార్థులకు, సిబ్బందికి సేవలందించేందుకు ప్రత్యేక కమిటీలను అందుబాటులో ఉంచుతామని రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-11-22T05:10:11+05:30 IST