60 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
ABN , First Publish Date - 2020-11-27T06:12:08+05:30 IST
కారులో తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పట్టణ పోలీసులు పట్టుకున్నారు.
నర్సీపట్నం, నవంబరు 26 : కారులో తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమచారం మేరకు గురువారం పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహన తనిఖీలు చేపట్టగా, అటుగా వచ్చిన కారును ఆపి పరిశీలించగా గంజాయి కనిపించింది. దీంతో సరుకుతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీకి చెందిన వంతల తిరుపతి, బుటారి చంటిబాబులను అరెస్టు చేసినట్టు సీఐ స్వామినాయుడు తెలిపారు.