2.46 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్
ABN , First Publish Date - 2020-08-16T11:14:45+05:30 IST
ఈపీడీసీఎల్ పరిధిలోని 2.46 లక్షల మంది రైతులకు పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీఎండీ నాగలక్ష్మి పేర్కొన్నారు. కా
![2.46 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి
విశాఖపట్నం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఈపీడీసీఎల్ పరిధిలోని 2.46 లక్షల మంది రైతులకు పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీఎండీ నాగలక్ష్మి పేర్కొన్నారు. కార్పొరేట్ కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రాజబాపయ్య, రమేశ్ప్రసాద్, సీజీఎంలు పాల్గొన్నారు.