మాజీ మంత్రి కిడారిని ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు
ABN , First Publish Date - 2020-09-01T16:38:51+05:30 IST
కరోనా బారినపడి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న..

పాడేరు(విశాఖపట్నం): కరోనా బారినపడి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం ఫోన్ చేసి పరామర్శించారు. వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, మాజీ మంత్రి అయ్యన్న కూడా ఫోన్లో పరామర్శించారు.