శిక్షణతో అర్చకులలో మరింత నైపుణ్యం

ABN , First Publish Date - 2020-12-11T05:25:38+05:30 IST

గిరిజన ప్రాంతంలోని దేవాలయాల అర్చకులలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అర్చక అకాడమీ నిర్వహించిన శిక్షణ దోహదపడుతుందని దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికుమారి అన్నారు.

శిక్షణతో అర్చకులలో మరింత నైపుణ్యం
అర్చకులకు ధ్రువపత్రాలు అందిస్తున్న దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికుమారి


దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికుమారి

విజయవంతంగా ముగిసిన అర్చకుల శిక్షణ


పాడేరురూరల్‌, డిసెంబరు 10: గిరిజన ప్రాంతంలోని దేవాలయాల అర్చకులలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అర్చక అకాడమీ నిర్వహించిన శిక్షణ దోహదపడుతుందని దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికుమారి అన్నారు. గురువారం సూకురుపుట్టులో అర్చక శిక్షణ పొందిన అర్చకులకు ఆమె ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంత అర్చకులు నియమ నిష్టలతో పూజలు చేయాలన్నారు. మన్యంలోని 130 మంది గిరిజన అర్చకులకు అర్చక అకాడమీ డైరెక్టర్‌ ఎ.కృష్ణశర్మ, శారదాపీఠం ఆస్థాన పండితులు రఘునారాయణ దీక్షితులు నిత్యపూజా విధి విధానాలు, శుభముహ్తూలు, తదితర వాటిపై శిక్షణ ఇచ్చారు. అనంతరం అర్చకులు సూకురుపుట్టు నుంచి పాడేరు వరకు వానగిరి సంకీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి శ్రీధర్‌ బుజ్జిబాబు, విశ్వనాథ్‌, జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు కూడా రామకృష్ణ పరమహంస పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:25:38+05:30 IST