పాఠశాలల్లో డ్రైరేషన్‌ పంపిణీ పరిశీలన

ABN , First Publish Date - 2020-12-11T04:35:55+05:30 IST

కరోనా సమయంలో పాఠశాల విద్యార్థులకు డ్రైరేషన్‌ పంపిణీపై కాగ్‌ విభాగానికి చెందిన అధికారుల బృందం గురువారం పరిశీలించింది.

పాఠశాలల్లో డ్రైరేషన్‌ పంపిణీ పరిశీలన
మజ్జిపేటలో వివరాలు సేకరిస్తున్న కాగ్‌ బృందం

భీమునిపట్నం (రూరల్‌), డిసెంబరు 10: కరోనా సమయంలో పాఠశాల విద్యార్థులకు డ్రైరేషన్‌ పంపిణీపై కాగ్‌ విభాగానికి చెందిన అధికారుల బృందం గురువారం పరిశీలించింది. మండలంలోని మజ్జిపేటలో విద్యార్థుల తల్లులనుంచి వివరాలను సేకరించింది. ఈ ఏడాది మార్చి నుంచి నవంబరు వరకు ఎంతమంది విద్యార్థులకు కోడిగుడ్లు, బియ్యం, చిక్కీలు అందించారో రికార్డులు పరిశీలించారు.  

 

Updated Date - 2020-12-11T04:35:55+05:30 IST