పాడి రైతుల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ
ABN , First Publish Date - 2020-12-26T05:23:40+05:30 IST
మండలంలోని వంగలి, గొర్లివానిపాలెం, అంతకాపల్లి, మలునాయుడుపాలెం, ఎరుకునాయుడుపాలెం, నంగినారపాడు గ్రామాల్లో ఇటీవల పాడి రైతులు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులకు విశాఖ డెయిరీ డైరెక్టర్ శరగడం శంకరరావు శుక్రవారం బీమా చెక్కులు పంపిణీ చేశారు.
![పాడి రైతుల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122511513580/12252020235246n1.jpg)
సబ్బవరం, డిసెంబరు 25 : మండలంలోని వంగలి, గొర్లివానిపాలెం, అంతకాపల్లి, మలునాయుడుపాలెం, ఎరుకునాయుడుపాలెం, నంగినారపాడు గ్రామాల్లో ఇటీవల పాడి రైతులు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులకు విశాఖ డెయిరీ డైరెక్టర్ శరగడం శంకరరావు శుక్రవారం బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మృతుల కుటుంబాలకు డెయిరీ రూ.30 వేలు బీమాగా అందజేసేదని, ఇప్పుడు లక్ష రూపాయలకు పెంచినట్టు తెలిపారు. రైతులు పాడి ఉత్పత్తిని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ మేనేజర్ ఏఆర్ ప్రభాకరరావు, సూపర్వైజర్లు బి. కమలాకరరావు, పి.గురుణాథరావు, ఆడారి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు బోను గంగునాయుడు, గొర్లి కనకరాజు, కొటాన దేముడు తదితరులు పాల్గొన్నారు.