కేకే లైనులో పట్టాలు తప్పిన గూడ్సు రైలు
ABN , First Publish Date - 2020-12-30T05:56:56+05:30 IST
కొత్తవలస-కిరండోల్ (కేకే) మార్గంలో గూడ్సు రైలు జరాటి-మల్లిగుడ మధ్య పట్టాలు తప్పడంతో 08514 విశాఖపట్నం-కిరండోల్ పాసింజర్ (అరకు) రైలును కొరాపుట్ వరకు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు

అరకు రైలు కొరాపుట్ వరకే...
విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస-కిరండోల్ (కేకే) మార్గంలో గూడ్సు రైలు జరాటి-మల్లిగుడ మధ్య పట్టాలు తప్పడంతో 08514 విశాఖపట్నం-కిరండోల్ పాసింజర్ (అరకు) రైలును కొరాపుట్ వరకు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఈ కారణంతో రైలు కొరాపుట్ దాటి కిరండోల్ వరకు వెళ్లదని స్పష్టంచేశారు. ఇదే రైలు 08513 నంబర్తో కొరాపుట్ నుంచి విశాఖపట్నం బయలుదేరుతుందన్నారు.